Friday, May 3, 2024

లఖింపూర్‌ ఖేరి హింస కేసులో కేంద్రం మంత్రి కొడుక్కు బెయిల్‌ తిరస్కరణ..

లఖింపూర్‌ ఖేరి హింస కేసులో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు అశిశ్‌ మిశ్రా బెయిల్‌ పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ మంగళవారం తోసిపుచ్చింది. లఖింపూర్‌ ఖేరి హింసా కాండ కేసులో అశిష్‌ మిశ్రా గత ఏడాది అక్టోబర్‌లో అరెస్ట్‌ అయ్యారు.
ఆశిష్‌ బెయిల్‌ పిటిషన్‌పై జులై 15న వాదనలు ముగిసిన అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

ఆందోళన చేపట్టిన రైతుల మీదుగా వాహనం దూసుకెళ్లిన అనంతరం చెలరేగిన అల్లర్లలో ఎనిమిది మంది మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో మరణించిన వారిలో నలుగురు బిజెపి కార్యకర్తలతో పాటు నలుగురు రైతులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement