Wednesday, May 15, 2024

Delhi | విదేశీ పర్యటనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. సెర్బియా ఐటీఎఫ్‌కు ఆహ్వానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర పర్యాటక, సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వచ్చే నెల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా సెర్బియా ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్‌గ్రేడ్‌లో జరిగే 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ (ఐటీఎఫ్)కు హాజరు కావాలని.. సెర్బియా పర్యాటక శాఖ మంత్రి హుసేన్ మెమిక్, కిషన్‌రెడ్డికి ఆహ్వాన పత్రాన్ని పంపించారు.

యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి గత 30 ఏళ్లుగా అతిపెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే థీమ్‌తో ఈ ఐటీఎఫ్ జరగనుంది. వివిధ దేశాల నుంచి పర్యాటక శాఖల మంత్రులు, ఈ రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు, ఇన్వెస్టర్లు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొనబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement