Monday, May 6, 2024

ఈనెల 17న హుజురాబాద్‌లో అమిత్‌షా పర్యటన

హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మరింత హీటెక్కించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. తెలంగాణ విమోచన/విలీన దినం అయిన సెప్టెంబర్ 17న ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ హైకమాండ్ నేతలు ఎవరూ కూడా అక్కడ పర్యటించలేదు. కానీ హుజురాబాద్ ఉప ఎన్నికలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: ఈటెల రాజేందర్.. ఇంకా ఆరోగ్యశాఖ మంత్రేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement