Thursday, April 25, 2024

కేసీఆర్ సారధ్యంలో BRS జాతీయ పార్టీగా విజయఢంకా మోగించటం ఖాయం : మంత్రి పువ్వాడ అజయ్

దేశానికి కావాల్సింది దేశాన్ని అమ్మే ప్రధాని కాద‌ని, దేశ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాల‌ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ సంకల్పంతో యావత్ దేశ నలుమూలల దేశ ప్రజలకు కోతలు లేని కరెంట్ ఖచ్చితంగా అందితీరుతుంద‌న్నారు. కేసీఆర్ వెంట నడిస్తే యావద్దేశాన్ని అన్నపూర్ణ దేశంగా తీర్చిదిద్దవచ్చ‌న్నారు. రైతు రాజు అయ్యే రోజులు కేసీఆర్ తోనే సాధ్యం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు. దేశంలో బీజేపీ కేంద్ర పాలకుల నిర్ణయాలతో కొనసాగుతున్న నిరంకుశ పాలనను అంతమొందించేందుకు జాతీయ పార్టీగా బీఆర్ ఎస్ ప్రకటించడం పట్ల మంత్రి పువ్వాడ‌ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు దేశ ప్రజలను తమ డొల్ల మాటలతో గుజరాత్ ను రోల్ మోడల్ గా చిత్రీకరిస్తూ బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement