Friday, May 3, 2024

RIP. ఓటింగ్ కు వ‌చ్చిన ఇద్ద‌రు వ‌యో వృద్దులు మృతి…

ఎదులాపురం: ఆదిలాబాద్‌ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ (78) పోలింగ్‌ బూత్‌ దగ్గరికి వచ్చే సరికి ఫిట్స్‌ వచ్చి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భుక్తాపుర్‌నకు చెందిన రాజన్న (65) అనే వృద్ధుడు ఓటేసేందుకు వరుసలో నిల్చున్నారు. అంతలోనే కళ్లు తిరిగిపడిపోవడంతో ఆయన్ని కూడా రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement