Thursday, May 2, 2024

TS Election : 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముందుగానే పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది.

సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. 4 గంటల వరకు వరుసలో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. రాష్ట్రంలో మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement