Friday, May 17, 2024

జావా నుంచి రెండు ప్రీమియం బైక్‌లు..

హైదరాబాద్‌ : జావా యెజ్డీ రెండు ప్రీమియం బైక్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. జావా 42, యెజ్డీ రోడ్‌స్టర్‌ పేరుతో వీటిని తీసుకు వచ్చినట్లు తెలిపింది. జావా 42 ధర 1,98,142 రూపాయలు, రోడ్‌స్టర్‌ ధర 2,08,829 రూపాయలుగా ఉంది. ఈ బైక్‌లు క్లాసిక్‌ డిజైన్‌, అత్యాధునిక ఫీచర్లతో లభిస్తాయని కంపెనీ తెలిపింది.

భారత్‌లో తయారైన ఈ రెండు బైక్‌లను గ్లోబల్‌ మార్కెట్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ రెండు బైక్‌లు డీలర్ల వద్ద అందుబాటులోఉన్నాయని తెలిపింది. జావా 42 డ్యూయల్‌ టోన్‌ వేరియంట్‌తో లభిస్తుంది. కాస్మిక్‌ రాక్‌, ఇన్ఫినిటీ బ్లాక్‌, స్టార్‌షిప్‌ బ్లూ, సెలెస్టియల్‌ కాపర్‌ రంగుల్లో లభిస్తుంది. రోడ్‌స్టర్‌ 334 సీసీ ఇంజిన్‌తో లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement