Saturday, May 4, 2024

పుప్పాలగూడ ప్రమాదంలో చనిపోయింది ఇద్దరే.. వివరాలు వెల్లడించిన సీఐ శివ కుమార్

హైదరాబాద్లోని పుప్పాలగూడ ఈఐపీఎల్ లో ఇవ్వాల (శనివారం) జరిగిన ప్రమాదంలో ఇద్దరు మాత్రమే చనిపోయారని నార్సింగి సీఐ శివ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 13మంది పనిలో ఉన్నారని తెలిపారు. అందుఏలో 11 మంది ప్రమాదం బారి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నట్టు చెప్పారు.

కాగా, ఇద్దరు మాత్రం తప్పించుకోలేని పరస్థితుత్లో మట్టి పెల్లల కింద చిక్కకుని ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మీడియాకు వెల్లడించారు. కాగా, మృతులను ప్రసాద్ (శ్రీకాకుళం), వెంకటరమణ (జగద్గిరిగుట్ట) వాసులుగా గుర్తించినట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement