Friday, May 3, 2024

అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

ప్రపంచ పెద్దన్న పాత్రపోశిస్తున్న అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపింది. గత ఏడాదిగా అమెరికాలో ఎక్కడో ఒక చోట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం సైతం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ దుంగడులు భయపడడం లేదు. తాజాగా అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. టెక్సాస్‌లో దుండగుడు ఇద్దర్ని కాల్చి చంపారు.

కాల్పుల్లో మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ నలుగురిలో ముగ్గురు ప్రభుత్వ అధికారులు కావడం విషేశం. కాల్పుల తరువాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు దుండగుడు. అయితే ఇది కక్షపూర్వకంగా చేసిందా.. లేదా ఉగ్రవాద కుట్రనా అనే కోణంలో పోలీలు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement