Wednesday, May 1, 2024

కాకినాడ : రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గొల్లప్రోలు తాటిపర్తి జంక్షన్‌ దగ్గర ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement