Friday, April 26, 2024

నాగ‌బాబు చేతుల మీదుగా వాట్ కార్యాల‌యం ప్రారంభం..

తెలుగు టెలివిజన్‌ కోసం గతంలో, ఇప్పుడు రచనలుచేస్తున్న రచ యితలు అందరూ కలిసి వారి సంక్షేమం కోసం రైటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ (వాట్‌) ఏర్పాటు చేసుకున్నారు. రచయిత సాయిమాధవ్‌ బుర్రా తన కార్యాలయాన్ని వాట్‌ కోసం ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యాలయాన్ని నాగబాబు ప్రారంభించి, ఇందులో సభ్యుత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొమ్మనాపల్లి గణపతిరావు, కార్యదర్శి జి.శశాంక్‌, ఇంకా ఉషారాణి, రవి కొలికపూడి, అంజన్‌, ప్రభు, వెంకటేష్‌బహాబు, మహేంద్రవర్మ, ఫణికుమార్‌, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement