Saturday, April 20, 2024

దారుణం.. భార్య‌తో అక్రమ సంబంధం.. ప్రశ్నించిన భర్తకు గుండు గీసిన వైనం

చంద్రగిరి, (ప్రభ న్యూస్): ఆటో డ్రైవర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకునింది చాలక సదరు ప్రియుడు ఆటో డ్రైవర్ కి మూత్రం పోసి గుండు గీయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి… చంద్రగిరి మండలం ఏ రంగంపేటకు చెందిన వంశీ ఆటో నడిపి జీవనం సాగించేవాడు.. ఫేస్ బుక్ లో హైదరాబాద్ కు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు.. రంగంపేటకు వచ్చి కాపురం పెట్టారు. చంద్రగిరి చెందిన హర్షా రెడ్డి.. వంశీ కి పరిచయం అయ్యాడు.తరుచుగా హర్ష‌ ఎ రంగంపేటలోని వంశీ ఇంటికి వచ్చేవాడు.ఈ నేపథ్యంలో వంశీ భార్య‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వంశీ భార్య‌ని , ప్రియుడిని మందలించాడు.

వంశీ భార్య తాను హైదరాబాద్ కు వెళ్ళిపోతున్నట్లు చెప్పి వెళ్లి పోయింది. వంశీ కూడా గ్రామాన్ని వదిలి బెంగళూరుకి కూలి పని చేసుకోవడానికి వెళ్ళాడు.ఆమె ప్రియుడితో వుంటున్న‌ట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.ఇది చూసిన వంశీ.. భార్య.. ప్రియుడు ఇద్దరు చనిపోయినట్లు రిప్ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు.దానిని చూసి హర్ష‌రెడ్డి తన స్నేహితుడైన అన్వ‌ర్ ని తీసుకుని బెంగళూరు కి వెళ్లి వంశీని బలవంతంగా చంద్రగిరికి తీసుకొని వచ్చి మూత్రం పోసి గుండు గీయించారు. స్కూటర్కు వాడే సైలెన్సర్ ని కాల్చి పలు చోట్ల వాంతులు పెట్టార‌ని సమాచారం.అంత‌టితో ఆగకుండా తానే గుండు గీయించుకున్నాన‌ని,ఇక మీదట వారి జోలికి వెళ్ల‌న‌ని చెప్పించి వీడియో తీయించారు. బాధితుడైన వంశీ ఎక్కడున్నాడో ఎవరికి తెలియడం లేదు. అన్వ‌ర్ ,హర్ష‌లు కూడా స్థానిక చంద్రగిరి పంచాయతీలోని ఓ వార్డు సభ్యుడికి అనుచరులుగా ఉన్నారని సమాచారం. ఈ విషయంపై పోలీసులు ఎందుకు గోప్యతను పాటిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిందుతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో లేదో దృవీకరించాల్సి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement