Thursday, April 25, 2024

TTD: 27న తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల దేవస్థానంలో ఈనెల 27న బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా 27న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని పేర్కొన్నారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement