Tuesday, April 30, 2024

Breaking | 45 మంది ఇన్ స్పెక్టర్ల బదిలీ.. ఆదేశాలిచ్చిన ఐజీ

మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న 45 మంది ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీలోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ లతోపాటు ఒకే జిల్లాలో మూడేళ్ల నుండి పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement