Monday, May 20, 2024

TS | ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి

న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు, పార్టీ అభ్యర్థిగా యువ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరు ఖ‌రారైంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2023 న‌వంబ‌ర్ 4వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో రాకేశ్ రెడ్డి గులాబీ కండువా క‌ప్పుకున్నారు. ఇక‌ యువతలో, విద్యావంతులలో మంచి పట్టున్న రాకేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, ఫాలోయింగ్ ఉండటంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ ప్ర‌క‌టించారు.

రాకేశ్ రెడ్డి సొంతూరు.. హన్మకొండ జిల్లాలోని హాసన్‌ప‌ర్తి మండలం వంగపహాడ్. సామాన్య రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన రాకేశ్ రెడ్డి.. బిట్స్ పిలానీలో మాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్, మాస్ట‌ర్స్ ఇన్ ఫైనాన్స్ పూర్తి చేశారు. సిటీ బ్యాంక్ మేనేజర్‌గా, జేపీ మోర్గాన్, ఫేస్‌బుక్ లాంటి పలు అంతర్జాతీయ కార్పోరేట్ కంపెనీల్లో బెంగళూరు, అమెరికాలలో ఏడేళ్ల పాటు ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు చేసిన ఆయ‌న‌ రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement