Thursday, May 16, 2024

TS | ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. ప్రజావాణికి బ్రేక్ !

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి… ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా, ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నోడల్ అధికారి తెలిపారు. జూన్ 7న ప్రజావాణి పున:ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement