Saturday, April 27, 2024

టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు

తెలంగాణ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువును అధికారులు మ‌రోసారి పొడిగించారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని ఎంసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు. విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించారు.

ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌లో జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. అగ్రికల్చర్‌ వారికి 3, ఇంజినీరింగ్‌ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహించాలనుకుంటున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement