Friday, April 26, 2024

తిరగబడ్డ అడవిబిడ్డలు..ఫారెస్ట్ అధికారులపై దాడి..

భద్రాద్రి జిల్లాలో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తమ పోడు భూములు ఆక్రమించుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వారు చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింతగుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లారు. భూములను వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో గిరిజనులు తిరగబడ్డారు. తమ పోడు భూమిలోకి మీరు ఎలా వస్తారని నిలదీస్తూ బీట్ ఆపీసర్లను చుట్టుముట్టారు. మహిళలంతా ఏకమైన అధికారులను చెట్టుకు కట్టేసి దాడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement