Saturday, May 18, 2024

TS | 32 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు , 132 మంది తహసీల్దార్ల బదిలీ..

రాష్ట్రంలో పనిచేస్తున్న 32 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 132 మంది తహసీల్దార్ల ను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిటల్ ఇవ్వాల (శనివారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఒకే జిల్లాలో పనిచేసిన అధికారులను ఈనెల 15 లోపు బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో రెవెన్యూ, పోలీస్ శాఖ లతోపాటు ఇతర శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement