Friday, May 3, 2024

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఈనెల 14 వరకు పలు రైళ్లు రద్దు

విజయవాడ-గుడివాడ మార్గంలో ఈ నెల 14 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. విజయవాడ-ఉప్పులూరు మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రైళ్ల రద్దుతో పాటు, పలు రైళ్లను దారిమళ్లిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 వరకు విజయవాడ-గుడివాడ మీదుగా వెళ్లే 22 రైళ్లను రద్దు చేయనున్నారు. 9 రైళ్లను దారిమళ్లిస్తున్నామని, 2 రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నామని, 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ అధికారులు వివరించారు.

ఈ వార్త కూడా చదవండి: జియో నుంచి అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement