Tuesday, April 23, 2024

ఆచార్య అప్డేట్ ఇచ్చిన మేకర్స్… కొత్త పోస్టర్ రిలీజ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని…ఇక రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలుపుతూ… చిరంజీవి రామ్ చరణ్ అడవులలో కూర్చున్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు లాంగ్ గ్యాప్ తరువాత మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement