Sunday, April 28, 2024

Train Accident : గ్రీన్‌లో రెండు రైళ్లు ఢీ.. 26 మంది ప్రయాణికులు దుర్మరణం

గ్రీన్‌లో రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. మ‌రో 85 మంది గాయప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. వెంట‌నే ఘటనా స్థలంలో సిబ్బంది సహాయక చర్యలు చేప‌ట్టారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ రైలు ప్రమాదం థెస్స – లారిస్సా నగరాల మధ్య ప్యాసింజర్‌ రైలు, గూడ్స్‌ రైలు ఢీకొట్టడంతో చాలా బోగీలు పట్టాలు తప్పాయి. మ‌రికొన్నిబోగీలకు మంటలు అంటుకోగా ప్యాసింజర్‌ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టికే కొంద‌రి మృత‌దేహాల‌కు వెలికి తీశారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement