Friday, April 26, 2024

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో విషాదం.. మ‌ద్యం మ‌త్తులో స్నేహితున్నే చంపేశారుగా..!

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో విషాదం నెల‌కొంది. మద్యం మత్తులో స్నేహితిడినే హ‌త‌మార్చిన ఘ‌ట‌న ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో చోటుచేసుకుంది. రాత్రి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.. వేడుక‌ల్లో మ‌ద్యం ఫుల్ గా తాగి ఆ మ‌త్తులో కొందరు మిత్రులు.. స్నేహితుడిని గొంతుకోసి, విచక్షణారహితంగా చాకుతో గుండెల్లో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement