Thursday, April 25, 2024

కొత్త ఏడాది.. యాదాద్రికి పోటెత్తిన భక్తులు

కొత్త ఏడాది పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. కొండపైన ఉన్న బస్‌ బే, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని బిల్లా మందిర్‌ భక్తులతో కిక్కిరిసిపోయింది. బాలాజీని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. వరంగల్లులోని శ్రీ భద్రకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement