Tuesday, April 30, 2024

తమిళనాడు: విషాదం.. ఫ్రిజ్‌ పేలి ముగ్గురు మృతి 

చెన్నై : తమిళనాడు చెంగల్‌పట్టులో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్డ్‌ పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉరుపాక్కం రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఆర్‌ఆర్‌ బృందావన్‌ అపార్ట్మెంట్‌ ఫ్లాట్‌లో రిఫ్రిజిరేటర్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో దీంతో ఇరుగు పొరుగు వారు తలుపులు పగులకొట్టారు. రిఫ్రిజిరేటర్‌ పేలుడుతో వ్యాపించిన పొగ కారణంగా ఊపి రాడక గిరిజ, ఆమె చెల్లెలు రాధ, బంధువు రామ్‌ కుమార్‌ మృతి చెందాడు. గాయపడిన మరికొందరిని ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందని ముగ్గురు చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement