Wednesday, April 24, 2024

టిడిపి ఏపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత నివాసంలో.. సీబీఐ సోదాలు

సీబీఐ అధికారులు టిడిపి ఏపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత నివాసంలో సోదాలు నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఆమె స్వగృహంలో తనిఖీలు కొసాగుతున్నాయి. కర్ణాటకలో నమోదైన ఒక కేసు విషయంలో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారుల బృందం పెనుకొండకు చేరుకుంది. ఆమె ఇంట్లోని రికార్డులను, ఇతర లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఐ అధికారుల సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement