Monday, May 20, 2024

TS | రేపటి నుంచి రెండు రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్ వెళ్లనున్న నేపథ్యంలో రసూల్‌పురా, పీఎన్‌టీ జంక్షన్, బేగంపేట్, గ్రీన్స్‌ల్యాండ్, మోనప్ప జంక్షన్, రాజ్ భవన్ ఎంఎంటీఎస్ జంక్షన్, మెట్రో రెసిడెన్సీ లేన్, వీవీ స్టాచ్యూ జంక్షన్‌లలో రాత్రి 7.40 నుంచి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఈ నెల ఇక 18వ తేదీన ప్రధాన నరేంద్ర మోదీ రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. దీంతో ఉదయం 9.50 గంటల నుంచి 10.20 గంటలకు వరకు వివిస్టాట్యూ జంక్షన్, మెట్రో రెసిడెన్సీ లేన్, ఎంఎంటిఎస్ రాజ్‌భవన్, పంజాగుట్ట, గ్రీన్స్‌ల్యాండ్, హెచ్‌పిఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్‌టి ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను ఆపివేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement