Thursday, May 2, 2024

‘కిష‌న్ రెడ్డి’తో ఏపీ మంత్రి మేక‌పాటి భేటి..పర్యాటకాభివృద్ధి పై చ‌ర్చ‌ ..

ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ,కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం లో పర్యాటకాభివృద్ధి పై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలను సమర్పించారు.సోమశిల ప్రాజెక్టు పరిసరాలతో సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశంగల ప్రాంతాల ను గురించి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి,మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు . సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాల గురించి అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. “టెంపుల్ టూరిజం” అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవ కాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement