Friday, May 3, 2024

రేపు శాంసంగ్‌ కొత్త ఫోల్డబుల్‌ ఫోన్ల లాంచ్.. బెంగ‌ళూరులో ప్రారంభ కార్య‌క్ర‌మం..

హైదరాబాద్‌, (ప్రభన్యూస్‌) : బెంగళూరులోని శాంసంగ్‌ ఒపేరా హౌస్‌లో ఆగస్టు 10వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంటులో శాంసంగ్‌ తన తర్వాతి తరం ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేయబోతున్నది. కస్టమర్లు త్వరిత ప్రాప్యత కోసం అర్హులుగా ఉండడానికి గాను ఈవెంట్‌ కు ముందుగానే తదుపరి గెలాక్సీ స్మార్ట్‌ ఫోన్లను ముందస్తుగా – రిజర్వు చేసుకోవచ్చు. తర్వాతి గెలాక్సీ స్మార్ట్‌ ఫోన్‌ ని ముందస్తుగా రిజర్వు చేసుకోవడానికి గాను, కస్టమర్లు శాంసంగ్‌.కమ్‌ లేదా శాంసంగ్‌ ప్రత్యేక షోరూమ్‌ వద్ద ఒక టోకెన్‌ మొత్తం రూ.1,999 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. తర్వాతి గెలాక్సీ స్మార్ట్‌ ఫోన్లను ముందస్తుగా రిజర్వు చేసుకున్న కస్టమర్లు, ఉపకరణం డెలివరీ చేయబడిన తర్వాత రు.5వేల విలువైన అదనపు ప్రయోజనాలు పొందుతారని ఆ సంస్థ తెలిపింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement