Tuesday, April 30, 2024

నేటితో వాల్తేరు వీరయ్య‌కి.. 25రోజులు

ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌.ఈ మూవీలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి న‌టించ‌గా హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టించింది. జనవరి 13వ తేదీన రిలీజ్ అయింది ఈ మూవీ.కాగా ఈ చిత్రంలో రవితేజ కీలకమైన పాత్రను పోషించారు. ఈ పాత్రను సెకండాఫ్ లో ప్రవేశపెట్టడం వలన, అక్కడి నుంచి ఆడియన్స్ ఆశించిన స్థాయిలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది.కాగా సోమ‌వారంతో ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. చాలా సెంటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సరికొత్త పోస్టర్ ను వదిలారు. సంక్రాంతి తరువాత చాలానే సినిమాలు వచ్చినప్పటికీ, ‘వాల్తేరు వీరయ్య’కి పోటీగా నిలిచే స్థాయి సినిమాలు రాలేదు. అందువలన ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూనే వెళుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement