Sunday, April 28, 2024

National : ప్రధాని మోదీ ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్ల‌ఘించార‌ని… ఈసీకి టీఎంసీ ఎంపీ ఫిర్యాదు…

ప్ర‌ధాని మోదీపై ఎన్నిక‌ల సంఘానికి టీఎంసీ ఎంపీ ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తోన్న ప్రధాని మోడీ ఏపీ టూర్‌ కోసం ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లను వినియోగించారని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనంటూ కంప్లయింట్ చేశారు. కాగా తాను ఈసీకి రాసిన లేఖను మీడియాకు షేర్ చేశారు ఎంపీ సాకేత్ గోఖలే. 1975లోనూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఇదే కారణంతో ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించినట్లు టీఎంసీ ఎంపీ గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement