Thursday, May 9, 2024

19న తీస్‌మార్‌ ఖాన్‌..

వైవిధ్యమైన కథలను ఎంపికచేసుకుంటూ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తున్నడు హీరో ఆది సాయికుమార్‌. ఆయన తాజా చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో నిర్మిస్తున్నారు. ‘నాటకం’ వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్‌ జి గోగణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో ఆది సరసన పాయల్‌ రాజ్‌ పుత్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. సునీల్‌, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు.

ఎంతో ప్రతిష్టాత్మ కంగా రూపొందించిన తీస్‌ మార్‌ ఖాన్‌ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న విడుదల చేయబో తున్నామని ప్రకటించారు దర్శకనిర్మా తలు. చిత్ర ప్రమోషన్స్‌ లో భాగంగా రిలీజ్‌ చేసిన ఈ సినిమా పోస్టర్స్‌, గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తి పెం చేశాయి. ”మనం ఆపాలనుకున్నం త పవర్‌ మనదగ్గ రున్నా.. మనం ఆపలేనంత పవర్‌ వాడిదగ్గరుం ది” అనే డైలాగ్‌ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఎంత పవర్‌ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేసింది. హీరో ఎలివేషన్‌ సీన్స్‌, హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌తో రొమాంటిక్‌ సన్నివేశాలు, కామెడీ టచ్‌, యాక్షన్‌ సీన్స్‌ అన్నీ హైలైట్‌ కావడంతో ఈ టీ-జర్‌ కి మంచి వ్యూస్‌ వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement