Monday, April 29, 2024

రోడ్డుప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని వేగంగా వెళ్తున్న టిప్పర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులు శ్రీకాంత్, శివ, మహేష్‌గా పోలీసులు గుర్తించారు. కాగా యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై హాలియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement