Thursday, May 2, 2024

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ చెందిన ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా గుంటూరు నుంచి ధూళ్లిపాళ్లలోని ఓ స్పిన్నింగ్ మిల్లుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

అటు కర్నూలు జిల్లా నంద్యాలలోనూ బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న తల్లీకొడుకును నంద్యాల బైపాస్ రోడ్డులో అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సువర్ణ, అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు నంద్యాల నుంచి కౌలూరుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement