Thursday, May 2, 2024

జమ్ములో ఎన్‌కౌంటర్‌ – ముగ్గురు జవానులు వీరమరణం

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. కుల్గాంలోని హలాన్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గాలింపు కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిపోవడంతో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారు మరణించారని శ్రీనగర్‌ కేంద్రంగా పనిచేస్తున్న చినార్‌ కార్ప్స్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. కాగా, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనపు సైనిక బలగాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement