Friday, May 3, 2024

Follow up | ప్రాణాలు తీసిన ఈత సరదా! చెక్‌ డ్యాంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి

మరికల్‌, ప్రభన్యూస్‌: నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకుండా గ్రామ సమీపంలో గల చెక్‌డ్యాంలో సరదాగా ఈతకు వెళ్ళిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాకుండా గ్రామానికి చెందిన భాగ్య, అశోక్‌ దంపతులు రాధిక (19), నర్వ మండలం పాతరసిడి గ్రామానికి చెందిన గణేష్‌ కూతుర్లు శ్రావణి (14), మహేశ్వరి (12) ఈ ముగ్గురు కుటు-ంబ సభ్యులతో కలిసి చెందిన రాధిక అక్క వివాహానికి వెళ్లారు.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని రాత్రి తిరిగి రాకుండా గ్రామానికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో కుటు-ంబ సభ్యులకు తెలియకుండా సరదాగా ఈతకని చెక్‌ డ్యామ్‌ దగ్గరకు వెళ్లారు. ప్రమాదవశాత్తుగా నీట మునిగి మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై హరిప్రసాద్‌ రెడ్డి సంఘటనకు చేరుకుని మృతదేహాలను వెలికితీసి నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement