Tuesday, April 30, 2024

INDvsWI | WTC పాయింట్ల పట్టికలో ఇండియా ప్లేస్ ఇదే.. టాప్ లో ఎవ‌రున్నారంటే !

వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నిన్న (సోమవారం) వాన‌ కారణంగా రెండో గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో భారత క్రికెట్ జట్టుకు పూర్తి పాయింట్లు తీసుకునే అవకాశం ద‌క్క‌లేదు. ఫలితంగా, భారతదేశం కేవ‌లం 16 పాయింట్లను మాత్ర‌మే పొందగలిగింది. ఫలితంగా, వారు ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 ​​పాయింట్ల పట్టికలో 66.67 స్కోరుతో తో రెండవ స్థానంలో ఉన్నారు.

ఇక శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్థాన్ 100 శాతం స్కోరుతో మెద‌టి స్థానంలో ఉంది. మరోవైపు, వెస్టిండీస్ ప్రస్తుతం 4 పాయింట్లతో.. పాయింట్ల టేబుల్ ఐదవ స్థానంలో ఉంది. ఇక‌ వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్ భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో సోమవారం జరిగిన రెండో టెస్టులో ఐదో, చివరి రోజు భారీ వర్షం ఆట డ్రాగా ముగియ‌డంతో సిరీస్ ని భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement