Saturday, May 4, 2024

Crime: దొంగతనానికి వచ్చి మహిళను హత్య చేసిన కిరాతకుడు

ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద మేకల దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి జాన్ బీ అనే వృద్ధురాలి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు పక్కన జాన్ బీ అనే వృద్ధురాలు గుడిసె వేసుకొని నివాసం ఉంటుంది. ఆమె మేకలు కాసుకొని జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఓ వ్యక్తి మేకల దొంగతనానికి పాల్పడగా.. అది చూసిన జాన్ బీ ఆయనను ప్రతి గటించే ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను నిందితుడు హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement