Thursday, May 2, 2024

వరి ధాన్యం కొనరు.. కోట్లుపెట్టి ఎమ్మెల్యేలను కొంటారా? : మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట : వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు డబ్బులు ఉండవు కానీ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఎన్నికోట్లైనా ఖర్చు పెడతారా అని మంత్రి హరీష్‌ రావు కేంద్ర బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.100 కోట్లు పెట్టేందుకు వెనుకాడ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టడంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement