Sunday, April 28, 2024

ఈ ఐదుగురు టాప్‌ స్కోరర్స్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టాప‌ర్ల్లు వీరే

ఆస్ట్రేలియా గడ్డ మీద ఇటీవల ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌ ఫైవ్‌ సోరర్స్‌ ఉన్నారు. ఐసీసీ ఈ జాబితాను వెల్లడించింది.

విరాట్‌ కోహ్లీ

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 98.66 సగటుతో 296 పరుగులు చేసి టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అందులో నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సూపర్‌ 12లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో ఇది కోహ్లీ స్పెషల్‌ ఇన్నింగ్స్‌గా చెప్పుకోవచ్చు.

- Advertisement -

మాక్స్‌ ఓ డౌడ్‌

ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌ బ్యాటర్‌ మాక్స్‌ ఓ డౌడ్‌ మంచి బ్యాటింగ్‌ ప్రదర్శన చేశాడు. టోర్నీలో నెదర్లాండ్స్‌
జట్టు సూపర్‌ -12కు చేరడంలో ఓ డౌడ్‌ బ్యాటింగ్‌ ప్రదర్శన కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీ మొత్తంలో 242 పరుగులు చేసిన ఓ డౌడ్‌ జాబితాలో విరాట్‌ కోహ్లీ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓ డౌడ్‌ 53 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అదే అత్యుత్తమ స్కోరు.

సూర్యకుమార్‌ యాదవ్‌

భారత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన బ్యాటింగ్‌ స్టైల్‌తో క్రికెట్‌ ప్రియుల మదిని దోచుకున్నాడు. 189.68 స్ట్రైక్‌ రేటు, 59.75 సగటుతో టోర్నీలో మొత్తం 239 పరుగులు రాబట్టి జాబితాలో టాప్‌ స్కోరర్‌ జాబితాలో మూడో స్థానం సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే 68 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ టోర్నీలో సూర్యకుమార్‌ బెస్ట్‌ స్కోర్‌ ఇదే.

జాస్‌ బట్లర్‌

ఇంగ్లండ్‌ స్కిప్పర్‌ జాస్‌ బట్లర్‌ తడబడుతూ టోర్నీని మొదలు పెట్టినా జాస్‌ బట్లర్‌ తడబడుతూ టోర్నీని మొదలు పెట్టినా సరిగ్గా అవసరమైన సమయంలో ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. పరుగుల వరద పారించి 225 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సూపర్‌ 12లో న్యూజిలాండ్‌తో జరిగిన 47 బంతుల్లో 73 పరుగులు చేశాడు. సెమీ ఫైనల్‌ లో భారత్‌పై కేవ లం 49 బంతుల్లోనే 80 పరుగులు చేసి రోహిత్‌ సేన ఫైనల్‌ ఆశలపై నీళ్లు చల్లారు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బట్లర్‌ కీలక పాత్ర పోషించాడు.

కుషాల్‌ మెండిస్‌

శ్రీలంక జట్టు సూపర్‌ #2కు అర్హత సాధించడంలో ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ అత్యంత ముఖ్య పాత్ర పోషించాడు. 140 స్ట్రైక్‌ రేటు 31.85 సగటుతో టోర్నీ మొత్తంలో 223 పరుగులు చేశాడు. తొలి రౌండ్‌లో నెదర్లాండ్స్‌ పై చేసిన హాఫ్‌ సెంచరీ , సూపర్‌ 12లో ఐర్లాండ్‌పై చేసిన అర్థ శతకం మ్యాచ్‌ విన్నింగ్‌ అర్థ సెంచరీలుగా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement