Sunday, May 5, 2024

ఏప్రిల్‌ 26 నుంచి థియరీ పరీక్షలు.. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 10, 12వ తరగతుల టర్మ్‌-2 పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ బోర్డ్‌ ప్రకటించింది. వచ్చే నెల 26 నుంచి థియరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 26 నుంచి థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన బోర్డు.. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షల్ని ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనే నిర్వహించనున్నట్టు బోర్డు ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ గత నెలలోనే స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దేశంలోని కొవిడ్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సెకండ్‌ టర్మ్‌ పరీక్షలను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో మాత్రమే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సీబీఎస్‌ఈ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచిన శాంపిల్‌ క్వశ్చన్‌ పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రం ప్యాట్రన్‌ ఉండనుందని తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాది రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే టర్మ్‌-1 పరీక్షలు పూర్తికాగా.. 10, 12వ తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 26న పరీక్షలు మొదలవుతాయని పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూసివేతను దృష్టిలో ఉంచుకొని రెండు పరీక్షల మధ్య గణనీయమైన వ్యవధి ఇచ్చామని శుక్రవారం సర్కులర్‌ విడుదల చేసింది. డేట్‌ షీట్‌ను తయారు చేసినప్పుడు జేఈఈ మెయిన్‌ సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్టు బోర్డు పేర్కొంది. పరీక్ష తేదీల వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement