Sunday, April 28, 2024

నాలుగేళ్ళలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.1,20,875 కోట్లు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి కేంద్ర పన్నులలో వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 20 వేల 875 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2018-19 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల వరకు ప్రత్యక్ష పన్నుల కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన నికర వసూళ్ళు లక్షా 29 వేల 267 కోట్ల రూపాయలని ఆయన తెలిపారు.

ఇవే కాకుండా నాలుగు ఆర్థిక సంవత్సరాలలో జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వసూలైన మొత్తం లక్షా 11 వేల 312 కోట్ల రూపాయలని చెప్పారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వసూలైన మొత్తం రెండు లక్షల 40 వేల 579 కోట్ల రూపాయలు. ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా కేంద్రం వసూలు చేసిన పన్నులలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా ఇచ్చింది లక్షా 20 వేల 875 కోట్ల రూపాయలని మంత్రి గణాంకాలతో సహా వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement