Sunday, April 28, 2024

రంగ‌మార్తాండ‌.. పువ్వై విరిసే ప్రాణం ఫుల్ సాంగ్

స్టార్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం రంగ‌మార్తాండ‌.ఇది ఒక రంగస్థల నటుడి చుట్టూ తిరిగే కథ. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించారు. కాలెపు మధు – వెంకట్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం కోసం త‌న చివ‌రి రోజుల్లో సిరివెన్నెల రంగ‌మార్తాండ చిత్రంకోసం పువ్వై విరిసే ప్రాణం .. పండై మురిసే ప్రాయం అనే పాట‌ని రాశారు.ఈ పాటను స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళయరాజా స్వ‌యంగా ఆలపించారు.కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘పువ్వై విరిసే ప్రాణం .. పండై మురిసే ప్రాయం’ అనే పాటలోని కొంతభాగాన్ని రిలీజ్ చేశారు. ఆ పాటను ఇప్పుడు పూర్తి స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని ఒక పాత్ర అనుభవంగా కాకుండా, ప్రతి మనిషి జీవితంలోకి ఈ పాట తొంగి చూస్తుంది. ఇది ఒక పాటగానే కాదు .. జీవితసత్యాలను ఏరి కట్టిన మూటలా అనిపిస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ రూపొందింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement