Sunday, May 5, 2024

పోలీసు ఉద్యోగాల దరఖాస్తుదారులకు మరోఅవకాశం కల్పించిన నియామక బోర్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నియామక బోర్డు మరో ఆప్షన్‌ ఇచ్చింది. దరఖాస్తు సమయంలో ఎవరైతే ఫొటో, సంతకం సరిగ్గా చేయలేదో వారికి మరో అవకాశం కల్పించింది. తొమ్మిదవ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే సంబంధిత పొరపాట్లు జరిగిన అభ్యర్థులకు మెయిల్‌, మెసేజ్‌లను బోర్డు అధికారులు పంపించారు. వీరంతా 9 వ తేదీలోగా ఫొటో సంతకాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది. గత నెల 26 వ తేదీతో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో రాత పరీక్షకు సంబంధించిన అంశంపై నియామక బోర్డు దృష్టి కేంద్రీకరించింది., ఆగస్టు 7 వ తేదీన ఎస్‌ఐ, 21 న కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement