Tuesday, April 30, 2024

ఆలయ ప్రతిష్ఠతను కాపాడాలి.. యాదాద్రిలో కల్లూరి పూజలు

యాదాద్రి : ఎంతో ప్రాశస్తం కలిగిన యాదాద్రి ఆలయ ప్రతిష్ఠతను కాపాడాలని ఆలేరు కాంగ్రెస్ నియజకవర్గ నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మార్చి 28న 10వేల మంది రుత్వికులతో ఆలయ పునఃప్రారంభం అంగరంగవైభవంగా ప్రారంభిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ నేడు సాదాసీదాగా ప్రారంభించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ బేషజాలలకు పోకుండా రూ. వెయ్యి కోట్లతో పునః నిర్మాణం చేపట్టిన ఆలయ ప్రారంభం చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రారంభ ఉండాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement