Thursday, May 2, 2024

ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండే.. సీఎం కేసీఆర్

ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైద‌రాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… ఈనెల 14వతేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఏర్పాటు చేస్తామన్నారు. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ అన్నారు. కర్నాటకలో జేడీఎస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రి కావాలన్నారు. రాబోయేది రైతు ప్రభుత్వమేనన్నారు. త్వరలోనే పార్టీ పాలసీలు, రైతు పాలసీ, జల విధానం రూపొందిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement