Sunday, April 28, 2024

శిశువును విక్ర‌యించిన త‌ల్లి.. అరెస్టు చేసిన పోలీసులు

ఓ త‌ల్లి త‌న మూడు రోజుల ప‌సికందు అయిన బాలుడిని అమ్ముకున్న ఘ‌ట‌న ముంబైలో చోటుచేసుకుంది. మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్ న‌గ‌ర్ జిల్లా అహ్మ‌ద్ న‌గ‌ర్ జిల్లా షిర్డీలో వెలుగులోకి వ‌చ్చింది. స‌మాచారం అందుకున్న పోలీసులు క‌న్న కొడుకును విక్ర‌యించిన త‌ల్లిని, ఆమెకు స‌హ‌క‌రించిన మ‌రో న‌లుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే… డొంబివిలిలోని మ‌న్ప‌డ పోలీస్ స్టేష‌న్‌లో న‌వంబ‌ర్ 7న దాఖ‌లైన ఎఫ్ఐఆర్ ప్ర‌కారం.. సెప్టెంబ‌ర్‌లో మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ త‌మ కుటుంబం పేద‌రికంలో మ‌గ్గుతుండ‌టంతో శిశువును పోషించ‌లేక‌పోయింది. అందువ‌ల్ల బాబును విక్ర‌యించేందుకు త‌గిన క‌స్ట‌మ‌ర్ కోసం వెతుకుతోంది. ఈ సంంద‌ర్భంగా ఆమెకు అహ్మ‌ద్‌న‌గ‌ర్‌, థానేకు చెందిన క‌ళ్యాణ్‌, ముంబైలోని ములుంద్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు స‌హ‌క‌రించారు. ములుంద్‌లో నివ‌సించే ఓ వ్య‌క్తికి బాబును రూ 1.78 ల‌క్ష‌ల‌కు విక్ర‌యించారు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో బాబును తీసుకున్న‌ వ్య‌క్తి ఇంటిపై దాడులు చేప‌ట్టి, శిశువును క‌నుగొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో బాబును విక్ర‌యించిన త‌ల్లిని, ఆమెకు స‌హ‌క‌రించిన‌ వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండిhttps://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement