Tuesday, April 30, 2024

భార్యకు మాటిచ్చాడు…. పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు

పెళ్లి చేసుకునేటప్పుడు కష్టసుఖాల్లో తనకు జీవితాంతం తోడుగా ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తారు. అయితే కొంత మంది మాత్రం పెళ్లి చేసుకున్న రోజుల వ్యవధిలోనే విడిపోతారు. మరి కొంత మంది నెలల వ్యవధిలో విడిపోతారు. కానీ కొంత మంది మాత్రం ఎంతో అన్యోన్యంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా సంతోషంగా జీవిస్తారు. అయితే ఓ భర్త తన భార్య చనిపోయిందని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో సత్యన్నారాయణ పుష్పలత నివాసం ఉంటున్నారు. వీరి దాంపత్య జీవితానికి ఇద్దరు పిల్లలు. బాబు లోకేష్ 10, తేజ కు 9 సంవత్సరాలు. అయితే ఇటీవల రెండు నెలల క్రితం తన భార్య పుష్పలత అనారోగ్యంతో మృతి చెందింది. దీనితో భార్య చనిపోయిందన్న మనస్థాపంతో ఇంట్లో ఇద్దరు పిల్లలతో సహా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement