Tuesday, April 30, 2024

ఇంస్టాలో పరిచయం…గుడిలో పెళ్లి… తరువాత ఆత్మహత్య – అయిపాయే

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వయసు లో ఉన్న అమ్మాయిలు,అబ్బాయిలు చెడిపోతున్నారు. సామాజిక మాద్యమలతో ఎంత ఉపయోగం ఉందో అంతే స్థాయిలో చెడు కూడా ఉంది. ఈ మాధ్యమాల ద్వారా కొత్త పరిచయాలు ప్రేమ పేరుతో మోసపోవటాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా బంజారాహిల్స్ లో ఐశ్వర్య అనే 19 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నో అనడంతో మనస్తాపానికి గురై…. ప్రాణాలు తీసుకుంది. ప్రైవేట్
ఉద్యోగం చేస్తున్న ఆమెకు అషేర్ అనే యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి వారు గుడిలో పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లాడతానని అతడు నమ్మిస్తూ వచ్చాడు. ఇటీవల ఆమె నిలదీయగా, ముఖం చాటేశాడు. దీంతో ఆమె హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement