Saturday, May 18, 2024

11న‌ హైకోర్టులో విచారణకు టీచర్ల బదిలీల కేసు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన కేసు 11న హైకోర్టులో విచారణకు రానుంది. మంగళవారంతోనైనా ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందా లేదోనని ఉపాధ్యాయులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా ఈ కేసు హైకోర్టులో జూలై 3కు విచారణకు వచ్చింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం దాన్ని ఈనెల 11వ తేదీన వాయిదా వేసింది. అప్పటి వరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో బదిలీల అంశంలో ఉపాధ్యాయ వర్గం ఆందోళనలో ఉంది. అసలు బదిలీలు, పదోన్నతులు ఇప్పట్లో ఉంటయా? ఉండవా? వీత్ర అసంతృప్తిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement